ముఖ్యమంత్రి జగన్ చేతగానితనాన్ని అసులుగా తీసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు.. నెల్లూరులో మహిళపై జరిగిన అరాచకాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు లోకేష్.. మహిళను అత్యంత దారుణంగా హింసించడమే కాక వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందన్నారు.. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డపై దాడులకు తెగబడుతున్నారన్నారు లోకేష్.. నిందితుల్ని పట్టుకొని బెయిల్పై అతిథి మర్యాదలతో ఇంటి వద్ద దింపడం కాదని, వారిని కఠినంగా శిక్షించినప్పుడే ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని లోకేష్ అన్నారు.