By - Sathwik |19 May 2026 7:30 AM IST
వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్
మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై మరోసారి పడింది.
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకు అదనపు భారంగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు మరోసారి నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం లీటరు పెట్రోల్, డీజిల్పై సగటున సుమారు 90 పైసల మేర పెంపు అమలు చేశారు. అయితే వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, రవాణా వ్యయాలు, ఇతర చార్జీల ఆధారంగా ఈ పెంపులో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 80 పైసల నుంచి ఒక రూపాయి వరకు కూడా నమోదైంది.
ఇప్పటికే నాలుగు రోజుల క్రితం లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున పెంచిన చమురు సంస్థలు, మళ్లీ తక్కువ వ్యవధిలోనే ధరలు పెంచడం గమనార్హంగా మారింది. వరుస ధరల పెంపులతో రవాణా రంగంతో పాటు సాధారణ వినియోగదారులపై ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా ధరల ప్రకారం దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.98.64కు చేరగా, కోల్కతాలో రూ.109.70, ముంబయిలో రూ.107.59, చెన్నైలో రూ.104.49గా నమోదైంది. డీజిల్ ధరలు కూడా పెరిగి దిల్లీలో రూ.91.58, కోల్కతాలో రూ.96.07, ముంబయిలో రూ.94.08, చెన్నైలో రూ.96.11గా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా తాజా సవరణలతో పెట్రోల్ ధర రూ.110.89కు చేరగా, డీజిల్ ధర రూ.98.96గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు ప్రపంచ మార్కెట్లో సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలహీనపడటం కూడా దిగుమతి వ్యయాలను పెంచుతున్న అంశంగా పేర్కొంటున్నారు. భారతదేశం అవసరమైన ముడి చమురులో అధిక భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున, అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే మార్పులు దేశీయ ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన దిగుమతి వ్యయాన్ని పూర్తిగా భరించడం కష్టమవడంతో చమురు సంస్థలు ధరల సవరణకు దిగినట్లు సమాచారం.
ఇక ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ధరల పెరుగుదల మాత్రం ఆగలేదు. మరోవైపు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంధన ధరలు పెరగడంపై రాజకీయ వర్గాల్లో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు రవాణా వ్యయాలను పెంచడంతో పాటు భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై మరోసారి పడింది. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకు అదనపు భారంగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు మరోసారి నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం లీటరు పెట్రోల్, డీజిల్పై సగటున సుమారు 90 పైసల మేర పెంపు అమలు చేశారు. అయితే వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, రవాణా వ్యయాలు, ఇతర చార్జీల ఆధారంగా ఈ పెంపులో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 80 పైసల నుంచి ఒక రూపాయి వరకు కూడా నమోదైంది.

