By - Sathwik |30 April 2026 11:39 AM IST
సంచలనం రేపుతున్న సీతారాం ఆత్మహత్య.. ముగ్గురితో భార్య రేణుకకు అక్రమసంబంధం
హైదరాబాద్లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి.
కుటుంబ బంధాలు, నమ్మకం, వ్యక్తిగత జీవితం మధ్య ఏర్పడిన విభేదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టంచేసింది. బాధితుడు తన ఆవేదనను 19 పేజీల లేఖగా రాసి చివరకు ప్రాణాలు తీసుకోవడం కేసుకు మరింత తీవ్రతను తెచ్చింది. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం తన భార్య రేణుక ప్రవర్తనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వివాహం జరిగిన కొన్నేళ్ల తర్వాత కుటుంబ జీవితం సాఫీగా సాగుతున్నట్లు కనిపించినా, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అతని జీవితాన్ని కుదిపేశాయి. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, బాచుపల్లిలో నివసిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ''నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు అసలు ఏం కావాలి.. ప్రేమ నా లేక శృంగారమా..? '' అంటూ ఓ భర్త.. ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏ అమ్మాయి కూడా అలా చేయవద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు.. ఈ క్రమంలోనే.. భార్య వివాహేతర సంబంధాలు బయటపడటం, ఇన్స్టాలో వీడియోలు బయటపడటంతో ఫిబ్రవరిలో ట్యాంక్బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భాగంగా రేణుకతో పాటు ఆమెకు సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. రమణారెడ్డి, శ్రవణ్ అనే వ్యక్తులు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన కుటుంబ విలువలు, వ్యక్తిగత నమ్మకం, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై సమాజంలో చర్చకు దారితీసింది. ఒక వ్యక్తి వ్యక్తిగత సమస్యలు ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తాయో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది.
హైదరాబాద్లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. కుటుంబ బంధాలు, నమ్మకం, వ్యక్తిగత జీవితం మధ్య ఏర్పడిన విభేదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టంచేసింది. బాధితుడు తన ఆవేదనను 19 పేజీల లేఖగా రాసి చివరకు ప్రాణాలు తీసుకోవడం కేసుకు మరింత తీవ్రతను తెచ్చింది. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం తన భార్య రేణుక ప్రవర్తనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వివాహం జరిగిన కొన్నేళ్ల తర్వాత కుటుంబ జీవితం సాఫీగా సాగుతున్నట్లు కనిపించినా, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అతని జీవితాన్ని కుదిపేశాయి. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా, బాచుపల్లిలో నివసిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ''నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు అసలు ఏం కావాలి.. ప్రేమ నా లేక శృంగారమా..? '' అంటూ ఓ భర్త.. ఏకంగా 19 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్య చేసుకున్నాడు.

