By - Sathwik |22 May 2026 6:00 PM IST
వంశీ మోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ, కొన్నిసార్లు బయటపడే వివరాలు అధికార యంత్రాంగాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
తాజాగా తెలంగాణలో ఒక డిప్యూటీ కలెక్టర్కు సంబంధించిన ఆస్తుల వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వ భూముల అక్రమాల నుంచి భారీ స్థాయిలో ఆస్తుల కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ దర్యాప్తులోనే బయటకు వస్తున్న అంశాలు ఈ కేసుపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్కు సంబంధించిన నివాసాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ప్రాథమిక సమాచారంతో అధికారులు దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. వంశీ మోహన్కు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.
వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం ప్రాంతాల్లో సుమారు ఎనిమిది ఎకరాల భూమిని అక్రమంగా కాజేసి, తన మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అనంతరం ఆ భూమిని ఒక రియల్టర్కు బదిలీ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంతేకాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో పొందినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వంశీ మోహన్పై వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం వెలువడుతోంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు కూడా విచారణలో కీలకంగా మారాయి. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న పత్రాల సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఈ కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ, కొన్నిసార్లు బయటపడే వివరాలు అధికార యంత్రాంగాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా తెలంగాణలో ఒక డిప్యూటీ కలెక్టర్కు సంబంధించిన ఆస్తుల వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వ భూముల అక్రమాల నుంచి భారీ స్థాయిలో ఆస్తుల కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రారంభ దర్యాప్తులోనే బయటకు వస్తున్న అంశాలు ఈ కేసుపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్కు సంబంధించిన నివాసాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ప్రాథమిక సమాచారంతో అధికారులు దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. వంశీ మోహన్కు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.

