ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ బూత్లో గుర్తించిన స్థానికులు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీలు వేయడంలో ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వయస్సు, హోదాతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వారికి డ్యూటీలు వేశారు. ఓటు హక్కు కూడా లేని ఓ బాలుడికి ఏకంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించారు. ఐఎస్ సదన్ డివిజన్(38) పరిధిలోని సింగరేణి కాలనీకి సంబంధించిన 24వ నంబర్ పోలింగ్ బూత్ లో వెలుగు చూసిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
స్థానిక నాయకులు ఆ బాలుడిని గుర్తించి ప్రశ్నించగా.. తన వయస్సు 17 ఏండ్లని చెప్పాడు. ఐడెంటిటీ కార్డుపై ఎ.వరుణ్ సాగర్, హోదా స్టూడెంట్ అని రాసి ఉంది.

