కరీంనగర్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో TRSV,BJP కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ముఖ్యమంత్రిపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్వీ సంజయ్ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం చేపట్టింది. విషయం తెలిసిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను వారించే ప్రయత్నం చేశారు. ఇరుపార్టీల నేతలు రోడ్డుకు రెండు వైపుల బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
For More News..
పులిని వండుకుతిన్న వేటగాళ్లు..

