Dailyhunt
నవోదయ స్కూల్‌లో 32 మంది విద్యార్థులకు కరోనా

నవోదయ స్కూల్‌లో 32 మంది విద్యార్థులకు కరోనా

V6 Velugu 4 years ago

నవోదయ స్కూల్‌లో 32 మంది విద్యార్థులకు కరోనా

V6 Velugu Posted on Oct 28, 2021

కొడగు: కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు, కాలేజీలకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

కొవిడ్ రూల్స్ పాటిస్తూ క్లాసులు జరుపుకోవాలని స్కూళ్లు, కళాశాలలకు ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో చాలా వరకు విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఓపెన్ అయిన ఓ పాఠశాలలో 32 మంది కరోనా బారినపడ్డారు. కర్నాటకలోని కొడగు జిల్లా మడికెరిలోని జవహార్ నవోదయ విద్యాలయలో చదువుకుంటున్న 22 మంది బాలురు, 10 మంది బాలికలకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ స్కూల్‌లో మొత్తం 270 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరికి వారం కింద కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్‌గా తేలిన వారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ పంకజాషన్ స్పందించారు. స్టూడెంట్స్‌ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొత్తం క్యాంపస్‌ను శానిటైజ్ చేశామన్నారు.

మరిన్ని వార్తల కోసం:

ఒక్క మ్యాచ్.. ఎన్నో కేసులు, అరెస్టులు.. మరెన్నో వివాదాలు

టీటీడీ బోర్డులోని 18 మందికి హైకోర్టు నోటీసులు

అధికారులు కలెక్టర్‌కు పాలేర్లు కాదు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News