ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి యాజమాన్యం తెరదించింది.
ఆర్టీసీలోకి విద్యుత్ బస్సులు రావడం వల్ల సంస్థ ప్రైవేటుపరం అవుతుందని, తద్వారా ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే అపోహలపై ఎపిఎస్ఆర్టిసి స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ సరికొత్త పర్యావరణహిత బస్సుల కొనుగోలు మరియు నిర్వహణ ప్రక్రియ కేవలం ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికేనని, దీనివల్ల సంస్థ ప్రైవేటీకరణ కాదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, ఆర్టీసీ కార్మికులు మరియు ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు.
Read Also : భోగాపురంలో అమానుషం..నష్టపరిహారం అడిగితే జేసీబీ బకెట్లో ఎక్కించి నెట్టేస్తారా?

పీఎం ఈ-బస్ సేవా పథకం.. ఏపీకి 1,050 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులు!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం ఈ-బస్ సేవా’ (PM-eBus Sewa) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఈ పథకం ద్వారా మొదటి దశలో దాదాపు 750 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రంలోని ప్రధాన నగరాల పరిధిలోకి రానున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) లేదా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్లో ఈ బస్సులు నడవనున్నాయి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో టెండర్లు దక్కించుకున్న ప్రైవేట్ సంస్థలు ఈ బస్సులను సరఫరా చేయనున్నాయి. దీనివల్ల ఆర్టీసీపై ముందస్తు పెట్టుబడి భారం పడకుండా, అధునాతన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని మేకర్స్ వివరించారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం.. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ కట్టుబడి!
రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు డీజిల్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం ఎంతో దోహదపడుతుందని ఆర్టీసీ పేర్కొంది. సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు పర్యావరణహితమైన (Eco-friendly) ప్రజా రవాణా వ్యవస్థను అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ నిరంతరం కట్టుబడి ఉంటుందని అధికారులు పునరుద్ఘాటించారు. ఈ ఈ-బస్సుల కొరకు రాష్ట్రంలోని ఎంపిక చేసిన 11 ప్రధాన నగరాలు మరియు వివిధ డిపోలలో అత్యాధునిక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సబ్స్టేషన్ల నిర్మాణం, ఛార్జింగ్ పాయింట్లు) పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు, ప్రయాణికులకు త్వరలోనే ఒక సరికొత్త ప్రయాణ అనుభూతి లభిస్తుందని యాజమాన్యం వెల్లడించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

