Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AIADMKలో పిక్ స్టేజి కి చేరిన అంతర్గత పోరు

AIADMKలో పిక్ స్టేజి కి చేరిన అంతర్గత పోరు

వార్త 1 week ago

న్నికల ఓటమి అనంతరం AIADMKలో రాజుకున్న అసంతృప్తి జ్వాలలు, తాజాగా అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షతో బహిర్గతమయ్యాయి. తమిళ వెట్రి కళగం (TVK) పట్ల అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు.

టీవీకేకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు ఓటు వేయడంతో పార్టీ పట్టు కోల్పోయినట్లయింది. ఈ పరిణామం పార్టీ క్యాడర్‌లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించడమే కాకుండా, నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పార్టీలో, ఇలా బహిరంగంగా ధిక్కార స్వరం వినిపించడం పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.

Read Also : రాబోయే కాలం విద్యుత్ వాహనాలదే!

 AIADMK

చర్యలకు ఉపక్రమించిన షణ్ముగం వర్గం

పార్టీ ఆదేశాలను బేఖాతరు చేశారంటూ ఎడప్పాడి పళనిస్వామి (EPS)పైనే ఎదురుదాడి ప్రారంభమైంది. షణ్ముగం వర్గానికి చెందిన విప్ విజయభాస్కర్ రంగంలోకి దిగి, పార్టీ లైన్ దాటిన పళనిస్వామితో సహా 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరడం సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పళనిస్వామికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు పెట్టేలా ఫిర్యాదులు చేయడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడతో పళనిస్వామిని రాజకీయంగా ఏకాకిని చేసేందుకు ప్రత్యర్థి వర్గం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

పట్టు కోసం పళనిస్వామి పాట్లు – జనరల్ బాడీ డిమాండ్

మరోవైపు తన అధికారాన్ని కాపాడుకునేందుకు పళనిస్వామి వర్గం ఎదురుదాడికి సిద్ధమైంది. ప్రత్యర్థి వర్గంలోని కీలక నేతలను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ, సంస్థాగతంగా పట్టు సాధించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకుందామంటూ షణ్ముగం వర్గం తక్షణమే ‘జనరల్ బాడీ’ (సాధారణ మండలి) సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలో కార్యకర్తల సమక్షంలోనే తేలాలని వారు పట్టుబడుతున్నారు. ఈ అధికార పోరాటం చివరకు పార్టీని రెండు ముక్కలు చేస్తుందా లేక కొత్త నాయకత్వం వైపు నడిపిస్తుందా అనేది వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha