నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన మైపాటి మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలుగా భావించిన ఈ ఘటన వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించి నిందితురాలైన కోడలిని, ఆమెకు సహకరించిన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా దస్తగిరి మండలంలోని ఒక గ్రామంలో మైపాటి మాధవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. తొలుత దీనిని సహజ మరణంగా చిత్రించే ప్రయత్నం జరిగినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
Read Also: NEET-UG: నీట్-యూజీ 2026 రద్దు: 'జెన్-జీ' నిరసనలకు కేజ్రీవాల్ పిలుపు
Nellore Crime
Nellore Crime: మృతురాలి మృతిపై అనుమానం
కోడలు పద్మశ్రీకి తన భర్త స్నేహితుడితోనే వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అత్త మాధవికి తెలియడంతో ఆమె కోడలిని తీవ్రంగా మందలించింది. తన అక్రమ సంబంధానికి అత్త అడ్డుగా ఉందని భావించిన పద్మశ్రీ ఆమెను అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. 8వ తేదీన అత్త నిద్రిస్తున్న సమయంలో పద్మశ్రీ తన తల్లి సహాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. మాధవిపై దిండు పెట్టి అదిమి పట్టి, ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. మృతురాలి మృతిపై అనుమానం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు మరియు విచారణ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
వందేభారత్లో టికెట్ బేరాలు: టీటీఈపై రైల్వే శాఖ సస్పెన్షన్ వేటు!

