సినీ పరిశ్రమలో హీరోయిన్గా తొలి అడుగుతోనే భారీ హిట్ అందుకోలేకపోతే, కెరీర్ స్థిరపడేందుకు కొంత సమయం పడటం సహజమే. ఆ దశలో ఓపికతో సినిమాలు చేస్తూ, సరైన అవకాశాల కోసం వేచిచూడాల్సి ఉంటుంది.
అదే సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇతర హీరోయిన్ల మధ్య తన స్థానాన్ని కాపాడుకోవడం కూడా సవాలే. ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే మీనాక్షి చౌదరి నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్డమ్ వైపు అడుగులు వేసింది.

'అనగనగా ఒక రాజు'తో 2026 సంక్రాంతి బరిలోకి మీనాక్షి
2026 సంక్రాంతి బరిలో ఆమె 'అనగనగా ఒక రాజు' (Anaganaga OkaRaju)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ పోలిశెట్టికి జోడీగా ఆమె నటించిన ఈ చిత్రంతో 'మారి' దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
2024, 2025 సంవత్సరాలు మీనాక్షి కెరీర్కు కీలక మలుపులుగా నిలిచాయి. 2024లో ఆమె టాలీవుడ్లో మహేశ్ బాబుతో, కోలీవుడ్లో విజయ్తో సినిమాలు చేయగా, దుల్కర్ సల్మాన్తో 'లక్కీ భాస్కర్'లోనూ నటించింది. ఒక్క ఏడాదిలో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. మహేశ్ బాబుతో కలిసి నటించిన 'గుంటూరు కారం' 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా, నటనలోనూ మీనాక్షి(Anaganaga OkaRaju) తన సత్తా చాటింది. యువతలో ఆమెకు క్రేజ్ మరింత పెరిగి, 'సంక్రాంతి బ్యూటీ'గా ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇప్పుడు అదే సంక్రాంతి సెంటిమెంట్తో 'అనగనగా ఒక రాజు' సినిమాతో 2026 జనవరిలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గట్టి పోటీ మధ్య విడుదలవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, నాగచైతన్యకు జోడీగా ఆమె నటిస్తున్న 'వృషకర్మ' కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

