Dailyhunt
Anantapur District: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

Anantapur District: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

వార్త 2 months ago

నంతపురం జిల్లా(Anantapur District) బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బసవరాజు (39) అనే వ్యక్తి మద్యపానానికి బానిసై, కుటుంబ సమస్యల కారణంగా మానసికంగా కుంగిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో(Anantapur District) విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మద్యపానం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా ఎలా ప్రభావితమవుతున్నాయన్న దానికి ఈ ఘటన మరో ఉదాహరణగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి గ్రామస్థులు సానుభూతి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

CID AP: సైబర్ ముఠాకు చిక్కిన 22 మంది యువతను రక్షించిన సిఐడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha