కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనకు సిద్ధంగా ఉన్నారు. జనవరి 29 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో (AP) ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్ట్లను ప్రారంభించనుండగా, పరిశ్రమలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ విషయాన్ని కుప్పం టీడీపీ (TDP) కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం వెల్లడించారు. పర్యటనలో స్థానిక సమస్యలపై సీఎం ప్రత్యక్షంగా అవగాహన పొందుతూ, ప్రాజెక్ట్ల విజయవంతమైన అమలు కోసం సూచనలు అందించనున్నారు. అయితే, (AP) ఈ పర్యటన ద్వారా నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం, ప్రజల సౌకర్యాలను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Nandyal District: వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు మాయం

