Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: ఒక నెలలో రైల్వే పోర్షన్ తొలగిస్తాం: మంత్రిపెమ్మసాని

AP: ఒక నెలలో రైల్వే పోర్షన్ తొలగిస్తాం: మంత్రిపెమ్మసాని

వార్త 4 months ago

AP: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmmasani Chandrasekhar) శుక్రవారం గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గుంటూరులోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ముఖ్యంగా బ్రిడ్జికి సంబంధించి ఉన్న రైల్వే భాగాన్ని తొలగించే పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read Also:AP: దావోస్ పర్యటన తర్వాత SLBC సమావేశంలో సీఎం సమీక్ష

శంకర్ విలాస్ బ్రిడ్జిపై కీలక నిర్ణయం

మీడియాతో మాట్లాడిన మంత్రి, శంకర్ విలాస్ బ్రిడ్జిలోని రైల్వే పోర్షన్‌ను వచ్చే నెలలో పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పనులు త్వరగా పూర్తయ్యేందుకు ఇప్పటికే రైల్వే శాఖతో పాటు సంబంధిత విభాగాలకు చెందిన మొత్తం 17 మంది అధికారులతో చర్చించి అవసరమైన అనుమతులు పొందినట్లు వెల్లడించారు.

ఈ రైల్వే పోర్షన్ తొలగింపు వల్ల గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని, ప్రజలకు రాకపోకలు మరింత సులభం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే మిగిలిన పనులకు కూడా వేగం పెంచి, బ్రిడ్జిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha