AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి

వార్త

వార్త

73d

Loading...

పార్వతీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : (AP) మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం వనజ గ్రామం లో విషాదం చోటుచేసుకుంది. వనజ గ్రామం చెందిన ఒకేకుటుంబానికి చెందిన నలుగురు (భార్యాభర్తలు, కుమారుడు, కుమార్తె) కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడగా తెల్లవారిన ఇంకా బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వ్యక్తులు వెళ్లి తలుపు కొట్టగా ఎటువంటి సమాధానం రాకపోవడంతో కేకలు వేసినా బయటికి రాకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కల వారు తలుపుని పగలగొట్టి లోనికి ప్రవేశించగా భార్యా భర్తలిద్దరూ కుమారుడు, కుమార్తె మంచంమీద పడి ఉండడం చూసి వెంటనే వారిని చికిత్స నిమిత్తం చినమేరంగి పిహెచ్ సి తీసుకువెళ్లగా భార్య భర్తలు ఇద్దరూ కుమారుడు అప్పటికే చనిపోయారని వారి యొక్క కుమార్తె కొనఊపిరితో ఉండగా మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కెజీహెచ్ హాస్పిటల్కి రిఫర్ చేశారని తెలిసింది.

మొత్తం ఆరుగురు కుటుంబసభ్యులు కాగా ఇద్దరు ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్నారు. (AP) మృతి చెందిన వారు మీనక మధుసూదన్ (35), సత్యవతి (30), మోష (4) మృతి చెందారు. అయోషా(6) చికిత్స పొందుతుంది. మిగతా ఇద్దరు కుమార్తెలు మాధూరి 7వ తరగతి, మోక్ష 4వ తరగతి చిన మేరంగి కస్తూరి బాయి పాఠ శాలలో చదువుతున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసు కున్న జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి, చినమేరంగి పీహెచ్సీలో మృతదేహాలను పరిశీలించారు. సమగ్ర దర్యాప్తు చేసి మృతికి గల కారణాలను కనిపెట్టాలని అది .కారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవి, పాల కొండ డిఎస్పీ రాంబాబు, చినమేరంగి సీఐ తిరుపతిరావు, ఎస్సై అనీష్, జియ్యమ్మవలస ఎస్సై ప్రశాంత్ పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

AP: విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గనున్నాయి: మంత్రి గొట్టిపాటి రవి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha