తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గురువారం ఉదయం నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. అయితే, పలు చోట్ల ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరారు.
ఎండ తీవ్రత మరియు క్యూ లైన్లలో రద్దీ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని గమనించిన నటుడు, రాజకీయ నాయకుడు విజయ్, పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటల పాటు (రాత్రి 8 గంటల వరకు) పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Assembly Elections
Assembly Elections: ప్రజా రవాణాపై ప్రత్యేక దృష్టి
కేవలం పోలింగ్ సమయమే కాకుండా, దూర ప్రాంతాల నుండి ఓటు వేయడానికి వచ్చే వారి సమస్యలను కూడా విజయ్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రధాన బస్ టెర్మినల్స్ మరియు రైల్వే స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు రవాణా సదుపాయం లేక చిక్కుకుపోయారని, వారికోసం అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన DMK మరియు AIADMK లతో పాటు, విజయ్ నేతృత్వంలోని TVK రంగంలోకి దిగడంతో పోటీ తీవ్రంగా మారింది. 234 స్థానాలకు గానూ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఉద్రిక్తతల మధ్య తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అక్కడ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మే 4న వెలువడే ఫలితాల కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

