Dailyhunt
బాకీ కోసం నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి!

బాకీ కోసం నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి!

వార్త 1 week ago

Pune Recovery Agent Attack: మహారాష్ట్రలోని పుణే నగరంలో ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు బరితెగించారు. హడప్సర్ ప్రాంతంలోని '15 నంబర్ చౌక్' వద్ద ఒక వ్యక్తిని అతని భార్య ముందే నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు.

క్రెడిట్ కార్డ్ బాకీల వసూలు పేరుతో జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఏజెంట్లు గూండాల్లా వ్యవహరించడం చూసి జనం భయాందోళనకు గురయ్యారు.

Read Also: Tadipatri crime updates: తాడిపత్రిలో హిజ్రాల వర్గపోరు - ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్

Pune Recovery Agent Attack: క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం దాడి

వివరాల్లోకి వెళ్తే, సదరు వ్యక్తి తీసుకున్న క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు చెందిన రికవరీ ఏజెంట్లు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, అతడిని బూతులు తిడుతూ దైహికంగా దాడికి దిగారు. బాధితుడి భార్య వేడుకుంటున్నా వినకుండా ఏజెంట్లు కర్కశంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha