West Bengal Repolling: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో పోలింగ్ అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పలు చోట్ల రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Himanta Biswa Sarma : బంగ్లాదేశ్పై హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగాల్లో రీపోలింగ్: 15 బూత్లలో నేడే పోలింగ్
ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్లో అక్రమాలు జరిగినట్లు తేలడంతో, మగ్రాహట్ (పశ్చిమ్) మరియు డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ శుక్రవారం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారులు మరియు జనరల్ అబ్జర్వర్లు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
- మగ్రాహట్ (పశ్చిమ్): 11 బూత్లు
- డైమండ్ హార్బర్: 4 బూత్లు
ఈ కేంద్రాల్లో శుక్రవారమే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

West Bengal Repolling: ఫల్టా నియోజకవర్గంలో 30 బూత్లపై సందిగ్ధత?
మరోవైపు, ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రీపోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 30 పోలింగ్ బూత్లలో ఈవీఎం బటన్ (బీజేపీ అభ్యర్థి పేరు వద్ద) పనిచేయలేదని వచ్చిన ఫిర్యాదులపై ఈసీ సీరియస్ అయ్యింది. ప్రత్యేక పరిశీలకుడు సుబ్రత్ గుప్తా విచారణ జరిపి, 30 బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
ఏప్రిల్ 29న ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో, నియోజకవర్గం అంతటా రీపోలింగ్ జరపాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
సామాన్యుడికి ఇంధన సెగ.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం?

