Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరు-ముంబై మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రారంభించిన అశ్విని వైష్ణవ్!

బెంగళూరు-ముంబై మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు.. ప్రారంభించిన అశ్విని వైష్ణవ్!

వార్త 1 week ago

Bangalore Mumbai New Train: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరు మరియు ముంబై నగరాల మధ్య సరికొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు.

ఈ రెండు ప్రధాన మెట్రో నగరాల మధ్య గత ముప్పై ఏళ్ల కాలంలో ఒక కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దశాబ్దాలుగా ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను నెరవేరుస్తూ, రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త రైలు సర్వీసు 16553 మరియు 16554 నంబర్లతో బెంగళూరులోని(Bangalore Mumbai New Train) అత్యాధునిక సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుండి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య వారానికి రెండు రోజులు చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల ఐటీ హబ్ బెంగళూరు, దేశ ఆర్థిక రాజధాని ముంబై మధ్య వ్యాపార, ఉద్యోగ రీత్యా ప్రయాణించే వేలాది మందికి కన్ఫర్మ్డ్ టికెట్ల లభ్యత సులభతరం కావడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

 The newly inaugurated train 16553 standing at Sir M. Visvesvaraya Terminal in Bengaluru decorated with flowers

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

CNG వాహనదారులకు షాక్..మరోసారి ధరల పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha