భారతదేశం- పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య కలకలం రేపుతున్నాయి.
ఇటీవల ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే పాకిస్థాన్ సైన్యం భారత్లోకి ప్రవేశించి దాడులు చేస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన ప్రసంగంలో భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు దాటి వచ్చి దాడులు చేస్తామంటూ భారత నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన ప్రస్తావిస్తూ.. పాకిస్థాన్ కూడా అదే స్థాయిలో స్పందించగలదని హెచ్చరించారు. భారత్ గనుక మా భూభాగంలోకి చొరబడాలని ప్రయత్నిస్తే, మేము కూడా వారి దేశంలోకి ప్రవేశించి దాడులు చేయడానికి వెనుకాడం అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Iran-America War: ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..ముదురుతున్న యుద్ధం
India vs Pakistan
India vs Pakistan: రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఉగ్రవాదంపై కఠినమైన వైఖరి
గత కొంతకాలంగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఉగ్రవాదంపై కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు అవతలి నుండి ఉగ్రవాదులు భారత్లో అశాంతిని సృష్టించాలని చూస్తే.. వారిని వారి స్వస్థలాల్లోనే (పాకిస్థాన్లోనే) అంతం చేస్తామని భారత్ స్పష్టం చేసింది. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులను ఉదహరిస్తూ భారత్ తన ఆత్మరక్షణ హక్కును నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ రక్షణ మంత్రి నుండి ఈ విధమైన ప్రతిస్పందన వచ్చింది. పాకిస్థాన్ మంత్రి చేసిన ఈ ‘దుందుడుకు’ వ్యాఖ్యలను రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ మరియు అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో కూడా పాకిస్థాన్కు ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో, భారత్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం వారి అంతర్గత రాజకీయ అవసరంగా కనిపిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

