Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్ VS జింబాబ్వే తొలి T20.. బరిలోకి వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్!

భారత్ VS జింబాబ్వే తొలి T20.. బరిలోకి వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్!

వార్త 2 weeks ago

India vs Zimbabwe T20: ఇంగ్లండ్ పర్యటనలో ఘోర ఓటమి తర్వాత టీమిండియా మరొక ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 23న హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న తొలి T20 మ్యాచ్‌తో ఈ 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది.

కెప్టెన్‌గా ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని శ్రేయస్ అయ్యర్‌కి ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ఐర్లాండ్‌పై రెండు మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌పై నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన శ్రేయస్, ఎలాగైనా విజయం సాధించి విమర్శకులకు సమాధానం చెప్పాలని పట్టుదలతో ఉన్నాడు.

Read Also : Danish Kaneria: భారత్‌లో నిరసనల తీరుపై పాక్ మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా ఆగ్రహం

 India vs Zimbabwe 1st T20: Vaibhav Suryavanshi and Rinku Singh set to take the field.

India vs Zimbabwe T20: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. రింకూ సింగ్ రీఎంట్రీ!

సీనియర్ వికెట్ కీపర్ సంజూ శామ్‌సన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చి అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు హార్దిక్ పాండ్యా గైర్హాజరీ, శివమ్ దూబే ఫామ్‌లేమి కారణంగా చాలా రోజుల తర్వాత తుది జట్టులో రింకూ సింగ్‌కు స్థానం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. పేసర్లుగా ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్‌లు దాదాపు ఖాయం కాగా, మూడో బౌలర్ రేసులో తీవ్ర పోటీ నెలకొంది. మయాంక్ యాదవ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్‌లలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది.

భారత తుది జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్/హర్ష్ దూబే/రవి బిష్ణోయ్.

నేడు జింబాబ్వేతో భారత్ టీ20.. శ్రేయాస్ సేన ఏం చేస్తుందో..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha