Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత సైన్యానికి 41 అత్యాధునిక 'జేకే 250ఈ' డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ

భారత సైన్యానికి 41 అత్యాధునిక 'జేకే 250ఈ' డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ

వార్త 2 weeks ago

Drogo Aerospace: భారత రక్షణ రంగాన్ని స్వదేశీ సాంకేతికతతో బలోపేతం చేసే దిశగా 'మేక్ ఇన్ ఇండియా' వేదికగా హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ (Drogo Aerospace) సంస్థ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది.

భారత సైన్యంతో కుదుర్చుకున్న రూ. 72 కోట్ల భారీ కాంట్రాక్ట్‌లో భాగంగా, మొదటి విడత కింద 41 అత్యాధునిక 'జేకే 250ఈ' (JK 250E) డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి విజయవంతంగా అందజేసింది. నాసిక్‌లోని సథరన్ కమాండ్ అధికారులకు ఈ తొలి బ్యాచ్‌ను అప్పగించిన సంస్థ.. మిగిలిన డ్రోన్లను రాబోయే ఆగస్టు నాటికి సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మైలురాయి దేశీయ రక్షణ తయారీ రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

Read also:Cockroach Janata Party: అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే?

ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌గా రూపాంతరం.. 3 గంటల నిరంతర నిఘా!

హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా ప్రస్థానం ప్రారంభించిన 'డ్రోగో డ్రోన్స్' సంస్థ, తన పరిధిని మరింత విస్తృతం చేస్తూ ఇటీవలే 'డ్రోగో ఏరోస్పేస్'గా పేరు మార్చుకుంది. కేవలం డ్రోన్ల తయారీకే పరిమితం కాకుండా.. విమానాలు, ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల రూపకల్పన, అత్యాధునిక నిర్వహణతో కూడిన పూర్తిస్థాయి పారిశ్రామిక, పరిశోధనా కేంద్రంగా ఇది అవతరించింది.

ఈ సంస్థ సరిహద్దుల రక్షణ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ సరికొత్త డ్రోన్లు ఒకసారి ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఎగురుతూ నిఘా ఉంచగలవు. శత్రువుల కదలికలను కనిపెట్టడానికి మరియు వ్యూహాత్మక సైనిక అవసరాలకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయని రక్షణ నిపుణులు కొనియాడారు.

Drogo Aerospace: రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న 'రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ' శంఖుస్థాపన వేడుకలో డ్రోగో ఏరోస్పేస్ తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనను వీక్షించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్థ ప్రతిభను మరియు వారు ఉపయోగించిన అత్యాధునిక సాంకేతికతను ప్రత్యేకంగా అభినందించారు.

"దేశంలోనే అగ్రగామి స్వదేశీ రక్షణ సాంకేతిక సంస్థగా ఎదగడమే మా లక్ష్యం. భారత సైన్యానికి మా తొలి బ్యాచ్ డ్రోన్లను అందించడం మా నైపుణ్యానికి, క్వాలిటీ స్టాండర్డ్స్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం." - యశ్వంత్ బొంతు, సంస్థ వ్యవస్థాపకుడు & సీఈఓ

తెలంగాణలో 1 లక్ష చదరపు అడుగుల భారీ ప్లాంట్

సంస్థ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) లో 5.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక డ్రోన్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సంస్థలో 300 మంది నిపుణులు పనిచేస్తుండగా, ఈ నూతన ప్లాంట్ అందుబాటులోకి వస్తే మరో 500 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఈఓ వెల్లడించారు.

భారతదేశం రక్షణ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న తరుణంలో.. డ్రోగో ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వైమానిక ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు, లోయిటరింగ్ మ్యూనిషన్స్ (Loitering Munitions) మరియు దీర్ఘకాలిక సామర్థ్యం గల యూఏవీలు (UAVs) దేశ భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

నిత్య యవ్వనం, నిండు ఆరోగ్యం: ఉదయాన్నే చేయాల్సిన అలవాట్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha