Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి 24 గంటల సమయం

భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి 24 గంటల సమయం

వార్త 3 days ago

TTD Updates: తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల కొండపై భక్తజన సంద్రంగా మారాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లు శ్రీవారి సేవా సదన్ వరకు కొనసాగుతున్నాయి.

Read also: West Godavari poultry: ఎండల ధాటికి 10 లక్షల కోళ్లు మృతి..

 Tirumala Srivari Darshan Rush

దర్శనానికి 24 గంటల సమయం

టోకెన్లు లేని భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం 18 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. భారీ రద్దీ కారణంగా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు సహనంతో సహకరించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ప్రయాణించాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. తిరుమలలో ప్రతి ప్రాంతంలో భక్తుల రాకపోకలు నిరంతరం కొనసాగుతున్నాయి.

TTD Updates: హుండీ ఆదాయం భారీగా నమోదు

గురువారం ఒక్కరోజే 79,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 45,125 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. ఒక్కరోజులోనే రూ.4.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా తిరుమలలో ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha