Dailyhunt
బిడ్డను కాపాడి సజీవదహనమైన తల్లి

బిడ్డను కాపాడి సజీవదహనమైన తల్లి

వార్త 3 weeks ago

Markapuram Bus accident: మార్కాపురం బస్సు ప్రమాదంలో వెలుగుచూసిన ఈ ఘటన అత్యంత హృదయవిదారకం. తన ప్రాణం పోతున్నా, కన్నబిడ్డను కాపాడుకున్న ఆ తల్లి, రమాదేవి త్యాగం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.

మంటల్లో చిక్కుకున్న క్షణంలో మాతృమూర్తి చూపిన ధైర్యం, ఆ కొడుకు మనోహర్ కళ్లెదుటే జరిగిన ఈ దారుణం వర్ణనాతీతం. ఈ బస్సు ప్రమాదంలో ఇవాళ 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Read Also:Markapuram Road Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత

 Mother saves son in Markapuram bus accident

ప్రాణాలకు తెగించి బిడ్డను రక్షించి..

అయితే ఈ ప్రమాదంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్‌తో కలిసి ఇదే బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా మంటలను గమనించి కొడుకును బయటికి తోసేసింది. మంటలు ఎక్కువ కావడంతో తాను బస్సులోనే చిక్కుకుని, కొడుకు కళ్లెదుటే సజీవదహనమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పాల కోసం చిన్నారి ఏడుపు.. చిరాకుతో చంపిన తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha