Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీహార్ టు బాలానగర్ వయా పాట్నా.. కేజీల కొద్దీ డ్రగ్స్ సీజ్!

బీహార్ టు బాలానగర్ వయా పాట్నా.. కేజీల కొద్దీ డ్రగ్స్ సీజ్!

వార్త 1 week ago

Jadcherla Ganja Arrest: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున గంజాయి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు.

బీహార్ నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్న నిందితుడిని పట్టుకున్నట్లు మహబూబ్ నగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి వెల్లడించారు. జడ్చర్ల ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వివరించారు.

తహసీల్దార్ ఆఫీస్ వద్దే విక్రయాలు!

బాలానగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో బహిరంగంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటూ ఎక్సైజ్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీనితో ఎక్సైజ్ సీఐ విప్లవరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు కార్తీక్ రెడ్డి, నాగరాజు తమ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి అక్కడ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.

బీహార్ నుంచి తెచ్చి ప్యాకెట్ల రూపంలో దందా

పోలీసుల విచారణలో నిందితుడు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు చెందిన ఉపేందర్ అని తేలింది. అతని వద్ద నుంచి ఎక్సైజ్ అధికారులు 3.150 కేజీల గంజాయిని, ఒక సెల్‌ఫోన్‌ను మరియు రవాణాకు ఉపయోగించిన హోండా వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడు ఉపేందర్‌ను మరింత లోతుగా విచారించగా.. తాను ఈ గంజాయిని బీహార్ నుంచి తక్కువ ధరకు నగరానికి తీసుకొస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇక్కడకు తెచ్చిన తర్వాత స్థానిక కూలీలు, యువతను టార్గెట్ చేస్తూ 3 నుండి 4 గ్రాముల చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, ఒక్కో ప్యాకెట్‌ను రూ. 400 చొప్పున విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.

Jadcherla Ganja Arrest: సమాచారం ఇస్తే పేర్లు 'గోప్యం'.. అధికారుల విజ్ఞప్తి

జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి కోరారు. ఎక్కడైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా లేదా రవాణా చేసినా వెంటనే ఎక్సైజ్ అధికారుల నంబర్లు అయిన 9030019943, 8712658866 లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా (రహస్యంగా) ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను పట్టుకున్న ఎక్సైజ్ సిబ్బందిని, అధికారుల బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దయ్యాలు వేదాలు పలికినట్లుంది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha