Dailyhunt
బీజేపీలోకి విజయసాయిరెడ్డి? పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు!

బీజేపీలోకి విజయసాయిరెడ్డి? పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు!

వార్త 3 weeks ago

Vijasayareddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరబోతున్నారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది.

ఈ రాజకీయ ఊహాగానాలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వివరణ ఇచ్చారు. విజయసాయిరెడ్డి తమ పార్టీలోకి వచ్చేందుకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రయత్నాలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also :TDP Foundation Day: 45వ ఏటలోకి తెలుగుదేశం పార్టీ: ఎన్టీఆర్ ఆశయాలకు నేటితో 44 ఏళ్లు పూర్తి!

 It is reported that Vijayasai Reddy has stated that he intends to take up farming for the time being.

Vijasayareddy: ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి వెల్లడించినట్లు సమాచారం

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, విజయసాయిరెడ్డి రాజకీయాల కంటే ప్రస్తుతం వ్యవసాయంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో తనకు తగిన గుర్తింపు లభించలేదని, అక్కడ అన్యాయం జరిగిందని ఆయన గతంలోనే వాపోయినట్లు పీవీఎన్ మాధవ్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి, వ్యక్తిగత పనులపై దృష్టి సారించాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

ఒకవేళ భవిష్యత్తులో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకుంటే, అది అంత సులభమైన ప్రక్రియ కాదని మాధవ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ మరియు జనసేన కూటమిగా ఉన్నందున, అటువంటి కీలక నిర్ణయాలను కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీంతో విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha