ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, విద్యుత్ పంపిణీ(Budget2026) రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో Revamped Distribution Sector Scheme (RDSS)కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ను సుమారు రూ.18,000 కోట్ల స్థాయికి పెంచే సూచనలు వినిపిస్తున్నాయి.

RDSS లక్ష్యం ఏమిటి?
2021లో ప్రారంభమైన RDSS పథకం దేశంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, తక్కువ నష్టాలతో, లాభదాయకంగా తీర్చిదిద్దడానికి రూపొందించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం:
- పంపిణీ వ్యవస్థ బలోపేతం
- ఆధునీకరణ
- వినియోగదారులకు మెరుగైన సేవలు
- స్మార్ట్ మీటర్లను వేగంగా అమలు
ఈ ఏడాది RDSSకు ఎంత బడ్జెట్?
నివేదికల(Budget2026) ప్రకారం, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది RDSSకు సుమారు రూ.18,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై సవివరంగా పరిశీలన జరుపుతోంది. ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక సంవత్సరంలో (FY26) ఈ పథకానికి సుమారు రూ.16,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
స్మార్ట్ మీటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి
స్మార్ట్ మీటర్ల పెంపు వేగం కూడా RDSSకు నిధులు పెంచడానికి కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతంలో ప్రతి నెలా సుమారు 1.5 లక్షల స్మార్ట్ మీటర్లు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ రేటును నిలిపి వేయకుండా కొనసాగించాలంటే అదనపు నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
డిస్కామ్ల అప్పుల సమస్య ఇంకా ఉంది
విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్లు) ఇప్పటికీ భారీ అప్పుల ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో RDSSకు నిధులు పెంచడం కీలకం. ఇప్పటికీ ఈ సంస్థలకు 7 ట్రిలియన్ పైగా అప్పులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంతో 2015లో ప్రారంభమైన ఉజ్వల్ డిస్కామ్ అస్యూరెన్స్ యోజన (UDAY) వంటి పథకాలు, అలాగే 2025లో ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణ బిల్లులు (సవరణలు) విద్యుత్ రంగాన్ని మరింత సుస్థిరంగా మార్చేందుకు లక్ష్యంగా ఉన్నాయి.
RDSS రెండు భాగాలుగా పనిచేస్తుంది
RDSS పథకం రెండు ప్రధాన భాగాలుగా పని చేస్తుంది:
- స్మార్ట్ మీటర్ల విస్తరణ: ప్రీపెయిడ్ మరియు సిస్టమ్ మీటర్లను అమలు చేయడానికి ఆర్థిక సహాయం
- పంపిణీ మౌలిక సదుపాయాల అభివృద్ధి: బలోపేతం, ఆధునీకరణ, నెట్వర్క్ మెరుగుదల
పథకం మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం సుమారు ₹97,000 కోట్లకు పైగా అంచనా వేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

