ప్రపంచం దృష్టి ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మరియు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఉంది. సరిగ్గా ఇదే సమయాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాలపై పట్టు సాధించేందుకు డ్రాగన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది.
ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోకి వచ్చే స్కార్బరో షోల్ ప్రాంతంలో చైనా భారీగా దూకుడు ప్రదర్శిస్తోంది.350 మీటర్ల అడ్డంకి: శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఈ ప్రాంతంలో చైనా 350 మీటర్ల పొడవైన తేలియాడే అడ్డంకులను నిర్మించింది.జాలర్ల వేటపై నిషేధం: ఈ అడ్డంకుల వల్ల ఫిలిప్పీన్స్ మత్స్యకారులు తమ సంప్రదాయ ప్రాంతాల్లో చేపల వేట సాగించలేకపోతున్నారు. వారిని చైనా కోస్ట్ గార్డ్ నౌకలు భయపెట్టి తరిమేస్తున్నాయి.
Read Also: Lashkar-e-Taiba: వెంటాడిన కర్మ.. సొంతగడ్డ పైనే కాల్పులు
Strait of Hormuz
Strait of Hormuz: అంతర్జాతీయ తీర్పును బేఖాతరు చేస్తున్న బీజింగ్
2016లో అంతర్జాతీయ న్యాయస్థానం స్కార్బరో షోల్ విషయంలో చైనా వాదనను తోసిపుచ్చింది. ఆ ప్రాంతంపై చైనాకు ఎటువంటి చారిత్రక హక్కులు లేవని స్పష్టం చేసింది. అయితే, చైనా మాత్రం ఈ తీర్పును పట్టించుకోకుండా, 2012 నుండి తన నియంత్రణలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు శాశ్వతంగా తన సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. చైనా దూకుడును అడ్డుకునేందుకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అమెరికాతో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. సంయుక్త విన్యాసాలు: వివాదాస్పద జలాల్లో అమెరికా మరియు ఫిలిప్పీన్స్ దళాలు కలిసి సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఇది చైనాకు స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. ఒకవైపు ఇరాన్ వద్ద అమెరికా తన నౌకాదళాన్ని మోహరించగా, మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకోవాల్సి రావడం అమెరికాకు సవాలుగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

