Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకుల దుర్మరణం

చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు యువకుల దుర్మరణం

వార్త 2 weeks ago

Nallamada Road Accident: బైక్‌పై వేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్‌లో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఈ విషాదకర ఘటన శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో చోటుచేసుకుంది.

Read Also : Periyapalayam Accident: లారీని ఢీకొట్టిన ఆటో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!

 Bike crashes into tree; three youths killed.

వివరాల్లోకి వెళితే.. ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా, నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.

Nallamada Road Accident: మృతుల గుర్తింపు..

మృతులను పుట్టపర్తికి చెందిన అనిల్, కొత్తచెరువు వాసి అర్జున్, గోరంట్లకు చెందిన దీక్షిత్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో వారి కుటుంబాల్లో, ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

రేపు మార్కాపురంలో చంద్రబాబు పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha