Secunderabad crime: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. మొబైల్ ఫోన్ చోరీ కేసులో తిరుమలగిరి పోలీస్టేషన్ పరిధిలో అరెస్ట్ అయిన అమీర్ హుస్సేన్ను (25) పది రోజుల కిందట చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.
జైలులో ఉన్న సమయంలో అతడు అందుబాటులో ఉన్న మేకులను మింగాడు.
Remand Prisoner Escapes from Gandhi Hospital
secunderabad crime: ఎలా తప్పించుకున్నాడు
దీంతో ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయలో బాత్రూమ్కు వెళ్లిన అమీర్ హుస్సేన్ కిటికిలోంచి తప్పించుకున్నాడు. పరారైన విషయం గుర్తించిన ఆస్పత్రి వర్గాలు పోలీసులుకు సమాచారం అందించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాంలింపు కోసం ప్రత్యేక బృందాలను గాలింపు కోసం రంగంలోకి దింపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
'ది ఫ్యామిలీ మ్యాన్' ప్రొడక్షన్ డిజైనర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు!

