Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌట్కూర్‌లో యథేచ్ఛగా  చెట్ల నరికివేత

చౌట్కూర్‌లో యథేచ్ఛగా చెట్ల నరికివేత

వార్త 2 weeks ago

Choutkur Pochampally | సంగారెడ్డి/చౌట్కూర్: ఒకవైపు పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో అక్రమ చెట్ల నరికివేతలు దారుణంగా పెరిగిపోతున్నాయి.

సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని పోచంపల్లి రహదారి పరిసర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పర్యావరణానికి నీడను, ప్రాణవాయువును అందించిన పాత చెట్లను కొందరు అసాంఘిక శక్తులు యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. ఏళ్ల తరబడి పెరిగిన చింత, వేప, కానుగ తదితర మహా వృక్షాలను నరికివేస్తున్నా అటవీశాఖ అధికారులు మౌనం వహించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త మొక్కల పెంపకం సరే.. పాత చెట్ల రక్షణ ఏదీ?

గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సరీలను ఏర్పాటు చేసి కొత్త మొక్కలను పెంచడం, ప్రణాళికాబద్ధంగా నాటడం అభినందనీయమే. కానీ, దశాబ్దాలుగా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న పాత వృక్షాలను కాపాడటంలో అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. గ్రామ శివారు ప్రాంతాలలో కొందరు కలప వ్యాపారులు, అక్రమార్కులు ఏళ్లనాటి చెట్లను కొట్టి లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Choutkur Pochampally: పట్టించుకోని అధికారులు - చర్యలకు డిమాండ్

చెట్లను నరుకుతున్నారంటూ బాధ్యులైన అధికారులకు ముందే సమాచారం ఇస్తున్నప్పటికీ, వారు కనీసం క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా రావడం లేదని చౌట్కూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం మరియు నిర్లక్ష్యం వల్లే కలప వ్యాపారులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికైనా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా స్పందించి, పోచంపల్లి రహదారిపై అక్రమంగా చెట్లను నరుకుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. అర్హతలివే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha