Dailyhunt
Christmas : పాస్టర్ల అకౌంట్లలో రూ.50 కోట్లు జమ

Christmas : పాస్టర్ల అకౌంట్లలో రూ.50 కోట్లు జమ

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవ మైనారిటీల సంక్షేమం దిశగా ఒక కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, రాష్ట్రంలోని పాస్టర్లకు గౌరవ వేతనాన్ని విడుదల చేసింది.

ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ వివరాలను వెల్లడిస్తూ, మొత్తం రూ. 50.10 కోట్ల నిధులను పాస్టర్ల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడం పట్ల క్రైస్తవ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కేవలం ఆర్థిక సాయమే కాకుండా, సమాజంలో ఆధ్యాత్మిక సేవలు అందించే వారికి ఇచ్చే గుర్తింపుగా మంత్రి అభివర్ణించారు.

ఈ నిధుల పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకగా జరిగిందని మంత్రి వివరించారు. 2024 డిసెంబర్ నుండి 2025 నవంబర్ వరకు, అంటే పూర్తి స్థాయి 12 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాన్ని ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 8,427 మంది పాస్టర్ల బ్యాంక్ ఖాతాల్లో నెలకు రూ. 5,000 చొప్పున ఈ నగదును నేరుగా జమ (DBT) చేశారు. క్రిస్మస్ పండుగ వేళ ఈ నగదు అకౌంట్లలో పడటం వల్ల వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

CP Sajjanar: న్యూఇయర్‌ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha