ప్రముఖ పారిశ్రామికవేత్త, యానాం రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు (GN Naidu) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాయుడు, శనివారం తుదిశ్వాస విడిచారు.
Read Also: Heat Waves : ఏపీలోని ఆ జిల్లాలో పెద్ద ఎత్తున వడగాలులు - IMD


కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన లోకేష్
శనివారం ఉదయం హైదరాబాద్లోని డాక్టర్ జీఎన్ నాయుడు నివాసానికి చేరుకున్న నారా లోకేష్, ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. పారిశ్రామిక రంగంలో నాయుడు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.
GN Naidu: Minister Nara Lokesh pays tribute to Dr. GN Naidu
పారిశ్రామిక రంగంలో తీరని లోటు
రీజెన్సీ సిరామిక్స్ వంటి దిగ్గజ సంస్థల ద్వారా పారిశ్రామికవేత్తగా డాక్టర్ జీఎన్ నాయుడు సుపరిచితులు. ఆయన మరణం కేవలం ఆయన కుటుంబానికే కాకుండా, పారిశ్రామిక రంగానికి కూడా తీరని లోటు అని రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

