Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబ్బు కోసం కొడుకును కిల్లర్ గా మార్చిన తల్లి

డబ్బు కోసం కొడుకును కిల్లర్ గా మార్చిన తల్లి

వార్త 1 week ago

Siddipet : తెలంగాణలోని సిద్దిపేట జిల్లా భూంపల్లికి చెందిన చాపల రజిత (38) అనే మహిళ సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కన్న మైనర్ కొడుకునే దారుణమైన హంతకుడిగా మార్చడం సంచలనం సృష్టిస్తోంది.

నేరాలు ఎలా చేయాలో, సాక్ష్యాలు ఎలా చెరిపేయాలో తెలుసుకోవడానికి క్రైమ్ సినిమాలు, ఆన్‌లైన్ వీడియోలను చూసిన సదరు మహిళ, తన కొడుకును బలవంతుడిగా మార్చేందుకు ఇంట్లోనే జిమ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది. ఒంటరిగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని, గత మూడు నెలల వ్యవధిలో వారిద్దరూ కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశారు. బాధితులను ఇంట్లోకి రప్పించి ఊపిరి ఆడకుండా చేసి చంపి, వారి శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం మృతదేహాలను సంచుల్లో నింపి, వాహనంపై నిర్మానుష్య ప్రాంతాలకు తరలించి పెట్రోల్ పోసి తగలబెట్టారు.

సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా గుట్టు రట్టు: నిందితుల అరెస్ట్

రామక్కపేట గ్రామ శివార్లలో సగం కాలిన స్థితిలో దొరికిన విజయ అనే మహిళ మృతదేహం కేసును దర్యాప్తు చేయడం ద్వారా ఈ భయంకరమైన హత్యల పరంపర బయటపడింది. క్లూస్ టీమ్, సీసీటీవీ (CCTV) విజువల్స్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు రజిత మరియు ఆమె మైనర్ కొడుకు కదలికలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు గతంలో రేఖ అనే మరో మహిళను కూడా హత్య చేసి అచమ్మయపల్లి అటవీ ప్రాంతంలో కాల్చివేసినట్లు, ఇంకో మహిళపై దాడి చేసి నగలు దోచుకున్నట్లు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు మరియు హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిని జైలుకు పంపగా, మైనర్ కొడుకును జువైనల్ హోమ్‌కు తరలించారు.

నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha