దేశ రాజధాని ఢిల్లీ(Delhi Crime)కి సమీపంలోని హర్యానా రాష్ట్రంలో మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్(Faridabad Incident) ప్రాంతంలో డిసెంబర్ 30 అర్ధరాత్రి అనంతరం ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తున్న 23 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి వ్యాన్లో ఎక్కించుకున్నారు.
అనంతరం ఆమెను గురుగ్రామ్ దిశగా తీసుకెళ్లి, కదులుతున్న వాహనంలోనే రెండు గంటలకుపైగా సామూహిక అత్యాచారానికి(Gang Rape) పాల్పడ్డారు.
Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు
బాధితురాలు తీవ్ర భయాందోళనలతో అనంతరం పోలీసులను ఆశ్రయించగా, ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

