Revanth Reddy Delhi Tour:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల మంజూరుపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.
కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే రెండోసారి రాజధాని వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ రహదారుల మెరుగుదల, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన ఎజెండాగా ఈ పర్యటన సాగుతోంది.
Read also: Medak: అభివృద్ధికి ముందడుగు: రూ. 2.93 కోట్లతో పనులకు ఎమ్మెల్యే రోహిత్ శంకుస్థాపన!
Revanth Reddy’s Delhi visit
నితిన్ గడ్కరీతో రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చ
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి సమావేశమై కీలక విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు త్వరితగతిన కేబినెట్ ఆమోదం తెలపాలని ఆయన కోరారు. దక్షిణ భాగం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులను డ్రై పోర్టులతో అనుసంధానించే కొత్త మార్గాల ప్రతిపాదనలను గడ్కరీ ముందు ఉంచారు.
Revanth Reddy Delhi Tour:విమానయాన, పట్టణాభివృద్ధి రంగాలపై దృష్టి
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఈ చర్చలు జరగనున్నాయి. అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశమై వివిధ అభివృద్ధి పనుల గురించి చర్చిస్తారు. కేంద్ర సహకారంతో తెలంగాణలో వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
మెదక్ జిల్లాలో 55 శాతం సర్ నమోదు: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

