Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..

ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..

వార్త 4 days ago

Ebola virus outbreak : ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో ఎబోలా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఇప్పటికే 118 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది అనుమానిత కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిఘా పెంచడంతో భారతదేశంలోనూ ప్రజల్లో ఒకింత ఆందోళన మొదలైంది. అయితే, దేశీయ వైద్య నిపుణులు భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

భారతీయులు ఆందోళన చెందాలా?

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఎయిమ్స్ (AIIMS) బిలాస్‌పూర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. ఎబోలా అనేది కరోనా లాగా గాలి ద్వారా లేదా నీటి ద్వారా వేగంగా వ్యాపించే వైరస్ కాదు. ఇది కేవలం సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట వంటి శారీరక ద్రవాల (Body Fluids) ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. కాబట్టి సాధారణ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Read Also: అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు..రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత

 Ebola virus outbreak

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 10 ముఖ్యమైన జాగ్రత్తలు:

  1. నిరంతర సమీక్ష: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ICMR విభాగాలు ఆఫ్రికాలోని (Ebola virus outbreak) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
  2. ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్: అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులలో కాంగో, ఉగాండా నుండి వచ్చే ప్రయాణీకులను నిశితంగా పరీక్షిస్తున్నారు.
  3. ప్రత్యేక ల్యాబ్‌ల గుర్తింపు: పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ని ప్రధాన ఎబోలా టెస్టింగ్ కేంద్రంగా సిద్ధం చేశారు.
  4. ఐసోలేషన్ వార్డులు: విమానాశ్రయాలు మరియు ప్రధాన నగరాల ఆసుపత్రులలో క్వారంటైన్ సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.
  5. చికిత్స గైడ్‌లైన్స్: ఒకవేళ వైరస్ దేశంలోకి ప్రవేశిస్తే పాటించాల్సిన ప్రామాణిక విధానాల (SOP) ను ముందే సమీక్షించారు.
  6. లక్షణాలపై అవగాహన: వైరస్ సోకిన 2 నుండి 21 రోజులలోపు తీవ్ర జ్వరం, ఒంటినొప్పులు, వాంతులు మరియు అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు.
  7. వ్యాక్సిన్ల లభ్యత: ఎబోలా నియంత్రణకు ‘Ervebo’ వంటి వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
  8. పుకార్ల నివారణ: సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
  9. అధికారిక సమాచారం: కేవలం కేంద్ర ఆరోగ్య శాఖ లేదా WHO ఇచ్చే నివేదికలనే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
  10. ప్రయాణ హెచ్చరికలు: ఆఫ్రికా దేశాలకు వెళ్లే వారు లేదా అక్కడి నుండి వచ్చేవారు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య రంగం భరోసా ఇచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నార్వే పర్యటనలో మోడీ బిజీ బిజీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha