Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈడీ కేంద్రం ఆదేశాల మేరకే పనిచేస్తుంది: రాబర్ట్ వాద్రా

ఈడీ కేంద్రం ఆదేశాల మేరకే పనిచేస్తుంది: రాబర్ట్ వాద్రా

వార్త 1 week ago

షిఖోపుర్ భూ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పెద్ద ఊరట లభించింది.

ఈ కేసులో సుదీర్ఘ కాలంగా విచారణ ఎదుర్కొంటున్న వాద్రాకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశిస్తూనే, ఎలాంటి అదనపు షరతులు విధించలేదు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరింత సమయం కోరడంతో తదుపరి విచారణను జూలై 10కు కోర్టు వాయిదా వేసింది.

Read Also: Warning : పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిక

 Robert Vadra Land Case

Robert Vadra Land Case: వ్యక్తిగతంగా హాజరైన వాద్రా

ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేయడంతో, రాబర్ట్ వాద్రా శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాద్రా తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్‌తో పాటు ప్రతీక్ చద్దా, అక్షత్ గుప్తా కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత వాద్రా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై, ఈడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశ న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా దగ్గర దాచడానికి ఏమీ లేదు. ఈడీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే పనిచేస్తోందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. అయినప్పటికీ నేను చట్టాన్ని గౌరవిస్తాను. దర్యాప్తు సంస్థ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు నేను భయపడను, ధైర్యంగా న్యాయపోరాటం చేస్తాను” అని వాద్రా స్పష్టం చేశారు.

అసలు ఏమిటీ షిఖోపుర్ భూ వివాదం?

ఈ కేసు నేపథ్యం 2008 ఫిబ్రవరి నాటి భూ లావాదేవీలతో ముడిపడి ఉంది. గురుగ్రామ్ సమీపంలోని షిఖోపుర్‌లో సుమారు 3.5 ఎకరాల భూమిని ‘స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ సంస్థలో రాబర్ట్ వాద్రా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత 2012లో అదే భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం DLF సంస్థకు రూ.58 కోట్లకు విక్రయించారు. తక్కువ కాలంలోనే భూమి విలువ అనూహ్యంగా పెరగడం, ప్రభుత్వ అనుమతులు మరియు భూ మ్యూటేషన్ ప్రక్రియలు అత్యంత వేగంగా జరగడంపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ మొత్తం లావాదేవీ అక్రమ ఆర్థిక లాభాల బదిలీ మరియు మనీలాండరింగ్‌లో భాగమేనని ఈడీ గట్టిగా ఆరోపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha