Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్‌పీజీ సంక్షోభంతో బెంగళూరు అతలాకుతలం..ఆటో డ్రైవర్లు విలవిల

ఎల్‌పీజీ సంక్షోభంతో బెంగళూరు అతలాకుతలం..ఆటో డ్రైవర్లు విలవిల

వార్త 2 months ago

ెంగళూరు(Bangalore) నగరంలో ఆటో ఎల్‌పీజీ (LPG) సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. నగరంలోని మొత్తం గ్యాస్ స్టేషన్లలో దాదాపు సగం మూతపడటంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ కొరత శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) నాటికి మరింత ముదిరింది. నగరంలోని గ్యాస్ పంపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన ఆటో రిక్షాలు ఇప్పుడు సర్వసాధారణ దృశ్యంగా మారాయి. బెంగళూరులోని ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ‘టోటల్ గ్యాస్’ (Total Gas) తన అన్ని అవుట్‌లెట్‌లను పూర్తిగా మూసివేసింది. ఇక ‘సూర్య గ్యాస్’, ‘సూపర్ గ్యాస్’ వంటి స్టేషన్లలో స్టాక్ మధ్యాహ్నం లోపే అయిపోతోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (HP), భారత్ పెట్రోలియం (BP) కేంద్రాల వద్ద కూడా గ్యాస్ కోసం ఆటోలు 3 కిలోమీటర్ల మేర క్యూలో నిలబడుతున్నాయి.

Read Also: Bangladesh Lock Down: బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!

 LPG Gas Crisis

LPG Gas Crisis: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..లబోదిబోమంటున్న వ్యాపారులు

అయినప్పటికీ, గంటల తరబడి వేచి చూసిన డ్రైవర్లకు నిరాశే ఎదురవుతోంది. స్టాక్ లేదంటూ సిబ్బంది వారిని వెనక్కి పంపుతున్నారు. ఒక ప్రైవేట్ గ్యాస్ స్టేషన్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులుగా వారికి అసలు స్టాక్ అందలేదు. సాధారణంగా రోజుకు నాలుగు టన్నుల గ్యాస్ వచ్చే చోట, గత వారం అది రెండు టన్నులకు పడిపోయి, ఇప్పుడు సున్నాకు చేరింది. గ్యాస్ ధరలు కూడా గతంలో లీటరుకు రూ. 58 ఉండగా.. ఇప్పుడు అవి విపరీతంగా పెరగడం పెట్టుబడిదారులపై అదనపు భారాన్ని మోపుతోంది. భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..లబోదిబోమంటున్న వ్యాపారులు..ఎంత పెరిగిందంటే.. ఈ సంక్షోభం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. గ్యాస్ దొరుకుతుందనే ఆశతో తెల్లవారుజామున 5 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నామని, కానీ మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు. కృష్ణస్వామి అనే డ్రైవర్ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం నింపుకున్న గ్యాస్‌తోనే నడుపుతున్నానని, ఇప్పుడు అది అయిపోవచ్చినందున ప్రయాణికులను తీసుకెళ్లడానికి భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో డ్రైవర్ శరవణ మాట్లాడుతూ.. గంటల తరబడి వేచి ఉంటే కేవలం 5 లీటర్లు మాత్రమే ఇస్తున్నారని, అది కేవలం 40-50 కిలోమీటర్లకే వస్తుందని చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ మోడళ్లు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha