Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎండ దెబ్బకు తెలంగాణ భగభగ : 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఎండ దెబ్బకు తెలంగాణ భగభగ : 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

వార్త 3 days ago

Telangan Temperatures: భానుడి భగభగలకు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతోంది. ఊహించని స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ ఎండ తీవ్రత 40.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Read Also: Rajiv Gandhi death anniversary: దేశ చరిత్రను తిరగరాసిన నాయకుడు రాజీవ్ గాంధీ

 Telangan Temperatures

పదేళ్ల రికార్డులను బద్దలు కొట్టిన మే నెల ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది మే నెలలో సూర్యుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ పలు జిల్లాల్లో గత పదేళ్ల రికార్డులను తిరగరాశాడు. అత్యధికంగా 46.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో 2019 మే నెలలో నమోదైన 46.3 డిగ్రీల రికార్డు ఇక్కడ బద్దలైంది. ఇక్కడ 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 2017లో నమోదైన 45 డిగ్రీల రికార్డును ఇది దాటేసింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పాదరసం 46 డిగ్రీల మార్కును దాటిపోగా, అత్యల్పంగా వనపర్తి జిల్లా చిన్నంబావిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవడం గమనార్హం.

Telangan Temperatures:వడదెబ్బకు 11 మంది బలి.. మృతుల్లో అత్యధికులు రైతులు, కూలీలే

తీవ్రమైన ఎండల కారణంగా బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ (Heatstroke) తగిలి 11 మంది విగతజీవులయ్యారు. మరణించిన వారిలో ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, రైతులు మరియు మున్సిపాలిటీ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, జనగామ, ములుగు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల మరియు ఆదిలాబాద్ జిల్లాలలో ఈ మరణాలు సంభవించాయి. మధ్యాహ్నం వేళల్లో అత్యవసర పనుల ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 25 వరకు రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఎండలు మండిపోతున్నప్పటికీ వాతావరణ శాఖ ఒక సానుకూల వార్తను అందించింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఆశాజనకమైన వేగంతో ముందుకు సాగుతున్నాయి. రాబోయే 3, 4 రోజుల్లో ఇవి తూర్పు, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. మరోవైపు, భూమికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తర తెలంగాణ వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన చల్లటి జల్లులు కురిసి, ఎండల నుండి తాత్కాలిక ఉపశమనం కలిగించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha