Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ!

ఏపీ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు.. చంద్రబాబు అధ్యక్షతన కీలక నేతల భేటీ!

వార్త 1 week ago

AP NDA Meeting: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (NDA) కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు.

గురువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కూటమికి చెందిన కీలక నేతలు సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.

 AP NDA Government

Read also: AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో 'అమరావతి ఐ' నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు

గత రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. వేడుకల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ రూపకల్పన, భవిష్యత్ వ్యూహాలపై నేతలు క్షుణ్ణంగా సమాలోచనలు జరిపారు. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రతి ఇంటికీ వివరించేలా వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం.

AP NDA Meeting: భాగస్వామ్య పక్షాల సమన్వయంతో ఘనంగా నిర్వహణ

ఈ కీలక సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొని తమ సూచనలను పంచుకున్నారు. కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల (టీడీపీ, జనసేన, బీజేపీ) మధ్య పూర్తిస్థాయి సమన్వయం ఉండేలా చూసుకుంటూ, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఈ రెండేళ్ల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha