Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

వార్త 2 weeks ago

AP Liquor Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన మద్యం కుంభకోణం (ఏపీ లిక్కర్ స్కామ్) దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఏ-9 (A-9) ఈశ్వర్ కిరణ్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ - SIT) ఎదుట లొంగిపోయారు.

గత కొంతకాలంగా విదేశాల్లో తలదాచుకున్న ఆయన, దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత్‌కు తిరిగి వచ్చి అధికారులకు లొంగిపోవడం గమనార్హం. గతంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం ఆయన వినతిని తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత కోర్టు, తక్షణమే దర్యాప్తు సంస్థ ముందు లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

నిధుల మళ్లింపులో కీలక పాత్ర.. ముమ్మరంగా సిట్ దర్యాప్తు!

మద్యం కుంభకోణంలో భారీ ఎత్తున చేతులు మారిన అక్రమ నిధులను వివిధ మార్గాల ద్వారా ఇతర ఖాతాలకు మరియు స్థలాలకు మళ్లించడంలో ఈశ్వర్ కిరణ్ కుమార్ కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. లిక్కర్ పాలసీ అక్రమాల ద్వారా వచ్చిన సొమ్మును వేర్వేరు మార్గాల్లో మనీ లాండరింగ్ చేశారనే ప్రధాన అభియోగాలు ఆయనపై ఉన్నాయి. ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో, నిధుల మళ్లింపు ఎవరెవరికి చేరింది, దీని వెనుక ఉన్న కీలక సూత్రధారులు ఎవరు అనే అంశాలపై సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈశ్వర్ కిరణ్ కుమార్ ఇంటరాగేషన్ ద్వారా మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు మరియు కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.

లోకేశ్‌పై భూమన ఫైర్.. టీటీడీ మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha