Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

వార్త 2 weeks ago

Ap govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర కీలక రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘గూగుల్’ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు భాగస్వామ్య పక్షాల సమన్వయంతో రాష్ట్రంలో సాంకేతిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది.

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు గూగుల్ ఆసియా-పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరుపక్షాలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాయి.

Read also:Chittoor incident: పుంగనూరులో వజ్రాల కోసం గణేష్ విగ్రహం ధ్వంసం

ఏఐ, ‘సంజీవని’ ప్రాజెక్టులపై ప్రత్యేక ఫోకస్

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ ఏఐ (AI) మరియు డేటా సెంటర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని, దీనికి గూగుల్ సంస్థ సాంకేతిక మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వ పాలనా విభాగాలు, ప్రజా సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో పాటు, ప్రతిష్టాత్మక ‘సంజీవని’ ప్రాజెక్టు అమలుకు గూగుల్ భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఏపీలోని నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ రంగాలలో నైపుణ్యాభివృద్ధి (Skill Development) శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు.

Ap govt: లాజిస్టిక్స్, సుస్థిర పట్టణాభివృద్ధిపై చర్చలు

సాంకేతికతతో పాటు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రముఖ వైసీహెచ్ (YCH) లాజిస్టిక్స్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై.. ఏపీలో సప్లై చైన్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. సుదీర్ఘ తీరప్రాంతం, వ్యూహాత్మక పోర్టులు, మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

మరోవైపు, యూఎన్ హాబిటాట్ (UN-Habitat) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రంలో ‘యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా పట్టణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి (Sustainable Urban Development) అవసరమైన గ్లోబల్ నాలెడ్జ్ షేరింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో సీఎంతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ తరలింపు ..ఒకవైపు బాధ ..మరోవైపు ఆనందం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha