Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షురూ.. తేదీలు ఇవే!

ఏపీలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షురూ.. తేదీలు ఇవే!

వార్త 3 weeks ago

AP EAPCET 2026: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈఏపీసెట్‌ (EAPCET)-2026 తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది.

జులై 20 నుంచి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్య కమిషనరేట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జులై 16న విడుదలైంది.

Read Also: Amaravati Development: స్టార్ హోటళ్లు, ప్రైవేట్ స్కూళ్లకు టెండర్లు.. ఎకరా ధర రూ.8.20 కోట్లు!

 EAPSET counseling to begin in two more days

AP EAPCET 2026: ముఖ్యమైన తేదీలు ఇవే

కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థుల సౌకర్యార్థం ముఖ్యమైన తేదీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

కౌన్సెలింగ్‌ ప్రక్రియతేదీలు
అధికారిక నోటిఫికేషన్ విడుదలజులై 16
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపుజులై 20 నుంచి జులై 29 వరకు
ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification)జులై 22 నుంచి జులై 31 వరకు
వెబ్ ఆప్షన్ల నమోదు (Web Options)జులై 25 నుంచి జులై 31 వరకు
వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశంఆగస్టు 1
మొదటి విడత సీట్ల కేటాయింపు (Seat Allotment)ఆగస్టు 6
కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ఆగస్టు 7 నుంచి ఆగస్టు 13 వరకు
కొత్త విద్యాసంవత్సరం తరగతుల ప్రారంభంఆగస్టు 10

ఆగస్టు 6న సీట్ల కేటాయింపు.. 10 నుంచి తరగతులు

షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు జులై 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం జులై 22 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కాలేజీలు, బ్రాంచిల ఎంపిక కోసం వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు జులై 25 నుంచి 31 వరకు అవకాశం కల్పించారు. ఇప్పటికే నమోదు చేసిన ఐచ్ఛికాల్లో మార్పులు చేసుకునేందుకు ఆగస్టు 1న ప్రత్యేక అవకాశం ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీట్ల కేటాయింపు ప్రక్రియను ఆగస్టు 6న నిర్వహించనున్నారు.

సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 7 నుంచి 13వ తేదీ మధ్య ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు షెడ్యూల్‌ను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణీత గడువుల్లో అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

Epaper: epaper.vaartha.com

ఏపీలో త్వరలో 1450 విద్యుత్ బస్సులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha