Mangoes : ఈ యేడాది భారతీయ మామిడి పండ్ల ఎగుమతి విషయానికొస్తే కాస్త వెనుకబడి ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉత్పత్తి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో చూస్తే ఈ యేడాది తగినంత మామిడి కాపు జరుగలేదు.
గత యేడాది ఎపెడా గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సుమారు 29.93 మెట్రిక్ టన్నుల మామిడి పళ్లను ఎగుమతి చేయగా 56.5 మిలియన్ అమెరికన్ డాలర్ల రాబడి రాబట్టింది. మామిడి పండ్లు భారత్ నుంచి అరబ్ దేశాలు, అమెరికా యునైటెడ్ కింగ్ డమ్, కువైట్, ఖతార్ (పాంతాలకు ఎగుమతి చేసి సాలీనా 80 మిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాం. మామిడి పల్ప్, జ్యూస్, ప్రాసెస్డ్ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా ఉన్నాయని చెప్పకుంటున్నా ఆల్ఫోన్సా వంటి విలువైన మామిడి పండ్ల ఎగుమతి బాగా తగ్గింది.
Read Also : Koheda Fruit Market: హైదరాబాద్ శివారులో రూ.1,091 కోట్లతో అతిపెద్ద పండ్ల మార్కెట్
mangoes
mangoes : దిగుబడి తగ్గింది
ప్రధానంగా మహారాష్ట్రలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో50 శాతం నుండి 90 శాతం వరకు దిగుబడి తగ్గింది. ఏదో మామిడి సాగు దిగుబడులతో విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నామని గొప్పగా చెప్పుకోడానికి ఉన్నా ఆ వెరైటీ మామిడి సాగును పెంచుకునేందుకు ప్రస్తుతమున్న ప్రయత్నాలు చాలవు. వాతావరణ ప్రభావంతో ఈసారి మామిడి సాగులో రైతు ఎంతో నష్టం అనుభవించాడు. తరచు ప్రకృతి బీభత్సంతో అకాల వర్షాలతో పూత రాలిపోయింది. దిగుబడి తగ్గింది. ఈ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో మామిడి పుష్పదశలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, అకాల వర్షాలు, వడగళ్ల వానల ప్రభావంతో పూత, పిందె రాలిపోయి మామిడి సాగు పెద్ద సవాలే ఎదుర్కొంది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద మామిడి ఉత్పత్తికాగా మామిడి ఉత్పత్తుల్లో 19శాతం మాత్రమే ఈసారి ఎగుమ తులకు నోచుకుంది. ఈసారి ఎగుమతుల్లో షిప్మెంట్లు 40 శాతం తగ్గిందని అంచనా.
mangoes
మామిడి తోటలవృద్ధికి తోడ్పడాలి
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్ కీ బాత్’ 134 ఎపిసోడ్కార్యక్రమంలో మామిడి ప్రాధాన్యతను ప్రస్తావించారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకపు మామిడి పండ్లకు అనుకూలంగా ఉండి సాటిలేనివిగా మార్పుచెందాయని వివరించారు. దక్షిణ భారతదేశంలో బంగెన పల్లి తోతాపురి, నీలం, మాల్లో రకాలు ఊరిస్తాయి. అటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో సువర్ణ ముఖి రకాలు విరివిగా పండుతున్నాయని, ఉత్తరప్రదేశ్లో దశహరీ, బెంగాల్లో హిమసాగర్ విరివిగా పండుతున్నాయి. కాశీలోని లాంగ్రా రకం మామిడి పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి. కానీ ఎగుమతి చేసే విధంగా ప్రతిసీజన్కు ముందుగానే మామిడి తోటలవృద్ధికి, యజమాన్యానికి తోడ్పడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. భవిష్యత్తులో వాతావరణ మార్పులకు తట్టుకునే సాగు పద్ధతులు, విలువ ఆధారిత ప్రాసెసింగ్, బలమైన ఎగు మతి విధానాలపై నిర్ణయాలు తీసుకోవడం అవసరం.
-వరిగొండ నవీన్ కుమార్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

