Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వార్త 2 weeks ago

Gandhi Sarovar project: హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'గాంధీ సరోవర్' ప్రాజెక్టుకు ఎట్టకేలకు కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతులు లభించాయి.

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా బాపూఘాట్ వద్ద నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ఈ కీలక పరిణామంపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు భారత సైన్యానికి (ఇండియన్ ఆర్మీ) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అనుమతి రావడం రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక మైలురాయి అని సీఎం పేర్కొన్నారు.

 Musi Rejuvenation

పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగానికి సరికొత్త ఊపు!

మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడం, నదీ పరివాహక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దడం మరియు నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. కేవలం పర్యావరణ పరిరక్షణే కాకుండా, సాంస్కృతిక మరియు సామాజిక వనరుల కేంద్రంగా బాపూఘాట్ ప్రాంతాన్ని మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మూసీ పరిసర ప్రాంతాలు సరికొత్త పచ్చదనంతో కళకళలాడనున్నాయి. నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ స్పేస్‌లు, వినోద వేదికలు, సాంస్కృతిక కేంద్రాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి. ఇది హైదరాబాద్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపునిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Gandhi Sarovar project: అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి

మూసీ రివర్‌ఫ్రంట్‌ను అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో, అత్యాధునిక హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. పర్యాటకులను ఆకట్టుకునేలా పచ్చదనం, ప్రజా ఉపయోగకరమైన వసతులు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక (ఫ్లాగ్‌షిప్) ప్రాజెక్టు అయిన మూసీ పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ తరహా సహకారం లభించడం రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాపూఘాట్‌లో త్వరలోనే గాంధీ సరోవర్ నిర్మాణ పనులు ప్రారంభం కానుండగా.. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే భాగ్యనగర మకుటంలో మరో ప్రతిష్ఠాత్మక పర్యాటక, పర్యావరణ మైలురాయి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

రామంతపూర్‌లో దొంగతనం..ఫేస్‌వాష్ అడిగినట్లు నటించి చోరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha