Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ను కలిసిన పవన్ కల్యాణ్

గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ను కలిసిన పవన్ కల్యాణ్

వార్త 3 weeks ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌ (లోక్ భవన్)కు వెళ్లిన జనసేనాని..

గవర్నర్‌ను కలిసి పలు కీలక విషయాలపై ముచ్చటించారు. ఈ భేటీ ఎంతో ఆత్మీయంగా, సానుకూల వాతావరణంలో ఫలప్రదంగా సాగిందని పవన్ కల్యాణ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని పేర్కొంటూ.. గవర్నర్ అందించిన అమూల్యమైన మార్గదర్శకత్వానికి, ఆయన చూపిన ఆతిథ్యానికి ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఐజీ ఆకే రవికృష్ణతో సమావేశం.. ‘ఈగల్’ విభాగం వార్షిక నివేదిక విడుదల

గవర్నర్‌తో భేటీ కావడానికి ముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని కలవరపెడుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణే ధ్యేయంగా పనిచేస్తున్న 'ఈగల్' విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'ఈగల్' విభాగానికి సంబంధించిన తాజా వార్షిక నివేదికను ఐజీ రవికృష్ణ ఉప ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను అరికట్టడానికి పోలీస్ శాఖ తీసుకుంటున్న కఠిన చర్యలను, ఇప్పటివరకు సాధించిన ఫలితాలను ఈ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు.

Pawan Kalyan: సోషల్ మీడియా వేధింపులపై కఠిన నిఘా.. మహిళల భద్రతకు పెద్దపీట

ఈ సమీక్షా సమావేశంలో ఇంటర్నెట్ వేదికగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) హద్దుమీరి జరుగుతున్న వ్యక్తిగత వేధింపులు, ట్రోలింగ్స్ మరియు ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వికృత మూకలపై సైబర్ క్రైమ్ విభాగం తీసుకుంటున్న కఠినమైన చర్యలను ఐజీ రవికృష్ణ.. పవన్ కల్యాణ్‌కు వివరించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు డిజిటల్ నేరాల నియంత్రణకు వినూత్న వ్యూహాలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.

Epaper: epaper.vaartha.com

ఏసీబీకి చిక్కిన లంచగొండి తిమింగలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha