Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

Google: ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన గూగుల్!

వార్త

వార్త

54d

Loading...

ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) తమ ఉద్యోగుల విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ అత్యంత వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మారుతున్న తరుణంలో..

ఆ వేగాన్ని అందుకోలేని వారు లేదా కంపెనీ లక్ష్యాలతో ఏకీభవించని వారు స్వచ్ఛందంగా తప్పుకునేలా 'వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్' (VEP) ను ప్రకటించింది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పంపిన అంతర్గత మెమో ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 'ఆల్ ఇన్' కావాలి.. లేదంటే తప్పుకోవాలి! గూగుల్ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) లోని ఉద్యోగులకు పంపిన ఈ మెమోలో షిండ్లర్ స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. 2025 లో కంపెనీ మంచి ఫలితాలను సాధించినప్పటికీ.. ప్రస్తుతం టెక్ ప్రపంచం చాలా వేగంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.

ఏయే విభాగాలపై ప్రభావం ఉంటుంది?

ఈ 'AI ఫస్ట్' రేసులో ప్రతి ఉద్యోగి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, కంపెనీ వేగాన్ని ఎంజాయ్ చేయలేని వారు లేదా ఇతర మార్గాలను చూసుకోవాలనుకునే వారు సెవరెన్స్ ప్యాకేజీ తీసుకుని గౌరవప్రదంగా వెళ్లిపోవచ్చని ఆయన సూచించారు. ఏయే విభాగాలపై ప్రభావం ఉంటుంది? ఈ తాజా ఎగ్జిట్ ప్యాకేజీ ప్రధానంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ విభాగాల్లోని ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. అయితే కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే అమెరికా లార్జ్ కస్టమర్ సేల్స్ టీమ్స్ వంటి కొన్ని కీలక విభాగాలకు ఈ ప్లాన్ వర్తించదు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

గూగుల్ వ్యూహం ఏంటి?

ఆల్ఫాబెట్ 100 ఏళ్ల బాండ్ల జారీపై బాంబు పేల్చిన మైఖేల్ బర్రీ.. ఏడాదిలోనే మూడవసారి.. గూగుల్ వ్యూహం ఏంటి? గూగుల్ ఏడాది కాలంలో ఇలాంటి ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించడం ఇది మూడవసారి. 2025 జూన్‌ లో ఆఫీస్ నుంచి పని చేయాలనే నిబంధనలు కఠినతరం చేసినప్పుడు మొదటిసారి.. అక్టోబర్‌ లో యూట్యూబ్ పునర్వ్యవస్థీకరణ సమయంలో రెండవసారి ఇలాంటి ప్యాకేజీలను ఆఫర్ చేసింది. బలవంతంగా ఉద్యోగులను తొలగించడం కంటే (Layoffs), స్వచ్ఛందంగా వెళ్లాలనుకునే వారికి ఆర్థిక సాయంతో కూడిన ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా వర్క్‌ ఫోర్స్‌ ను క్రమబద్ధీకరించాలని గూగుల్ (Google) భావిస్తోంది. మొత్తంగా చూస్తే.. గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోని ప్రకారం.. ఇప్పటికే మార్కెటింగ్, సెర్చ్ , హార్డ్‌వేర్ విభాగాల్లో సుమారు 5 శాతం మంది ఉద్యోగులు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ ను ఎంచుకున్నారు. చాలా మంది తమ కెరీర్‌ లో విరామం తీసుకోవడానికి లేదా కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని ఆమె తెలిపారు. మొత్తం మీద గూగుల్ ఇప్పుడు తన శ్రమని, శక్తిని పూర్తిగా AI మిషన్ వైపు మళ్లించే పనిలో పడింది.

Read hindi news: hindi.vaartha.com

Metro : ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha

Comments

2
Loading comments...