Vadodara Bus Accident: గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడోదరా (Vadodara) నగర శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక భారీ ట్రక్కును, వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read Also:Seshachalam crime: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు ఐదేళ్ల జైలు శిక్ష
అక్కడికక్కడే ఆరుగురు మృతి
Six people died and 20 were injured in this incident.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ ప్రైవేట్ బస్సు వడోదరా హైవేపై వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి బస్సు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘోర దాటికి బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులలో ఆరుగురు తీవ్ర క్షతగాత్రులై అక్కడికక్కడే మరణించారు.
20 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికుల్లో సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద శబ్దం విన్న స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీశారు. క్షతగాత్రులను అత్యవసర అంబులెన్సుల ద్వారా సమీపంలోని వడోదరా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Vadodara Bus Accident:డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగమే కారణం!
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న వడోదరా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చీకటిగా ఉండటం, బస్సు డ్రైవర్ అతివేగంగా (Over speeding) నడపడం వల్లే రోడ్డు పక్కన ఉన్న ట్రక్కును గమనించలేకపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడా లేదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

