Dailyhunt
Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య

వార్త 2 months ago

Guntur murder case: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. భర్త శివనాగరాజును అతని భార్య లక్ష్మీ మాధురి, ఆమె ప్రియుడు గోపీ, ఆర్‌ఎంపీ సురేశ్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వివాహేతర సంబంధానికి శివనాగరాజు అడ్డుగా నిలుస్తున్నాడనే కారణంతో ఈ హత్యకు పథకం రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది.

పోలీసుల కథనం ప్రకారం, నిందితులు ముందస్తు ప్రణాళికతో శివనాగరాజుకు నిద్రమాత్రలు కలిపిన బిర్యానీ తినిపించారు. నిద్రమత్తులోకి వెళ్లిన తర్వాత అప్పడాల కర్రతో అతడి గుండెపై బలంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన ఈ నెల 18వ తేదీన జరిగింది. తొలుత ఇది అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శవపరీక్ష నివేదికలో శివనాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో హత్య అనుమానం బలపడింది. ఆధారాలు సేకరించిన పోలీసులు లక్ష్మీ మాధురి, గోపీ, సురేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీంతో ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయనే చర్చకు ఈ హత్య మరో ఉదాహరణగా మారింది. పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Nalgonda crime: డబ్బులు ఇస్తాం అని నమ్మించి మహిళను హతమార్చిన దుండగలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha